రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని  వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పదే పదే చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం ప్రాణాలైనా ధారపోస్తాను అన్నట్టు వీరిద్దరు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే అని తేలిపోయాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీ దొంగ నాటకమాడుతుంది అని అంటున్నారు కొంతమంది.


ఈ క్రమంలో వైసిపి రాష్ట్రంలో తెలుగులో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని, ఢిల్లీ వెళ్లాక అక్కడ ఇంటర్వ్యూలో ఇంగ్లీషులో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల పెద్దగా లాభం ఉండదని చేస్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థమవుతోందని అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరిస్తున్నారు.


రీసెంట్ గా ఓ జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది…...ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా పెద్ద విషయం కాదని.. డైరక్ట్ గా తేల్చేశారు. హోదా ముఖ్యం కాదని… దానికి తగ్గట్లుగా నిధులు ఇవ్వాలన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇదంతా ఇంగ్లిష్ లో చెప్పారు. కానీ ఇదే పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవం పేరుతో నిర్వహించిన సభలో.. అచ్చ తెలుగులో… ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్షకు సిద్దమని ప్రకటించారు.


తరవాత కూడా విద్యార్థుల పరీక్షలు అయిపోగానే.. దీక్షకు సిద్దమని ప్రకటనలు చేశారు. ఇలా జగన్-పవన్ ప్రత్యేక హోదా విషయాలలో దొంగ నాటకాలు ఆడుతున్నారు అని అంటున్నారు రాష్ట్రంలో ఉన్న రాజకీయనాయకులు….వీరిద్దరూ తమ రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: