ఇన్నాళ్లూ చంద్రబాబు తోక పార్టీగా వ్యవహరించిన జనసేన ఇప్పుడు సొంత అడుగులు వేస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. తెలుగుదేశం ప్రజాద్రోహం చేస్తోందంటూ మంగళగిరిసభలో చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తారు. మంత్రి లోకేశ్ అవినీతిపైనా పవన్ కల్యాణ్ గళమెత్తారు. పవన్ వ్యాఖ్యలతో లోకేశ్ అవినీతి చర్చనీయాంశమైంది.
మొన్న రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు సర్కారుపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు జాతీయ మీడియాలోనూ రచ్చ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని నెట్వర్క్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి అంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతుందన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో డీఎస్పీ పోస్టింగ్ ఇవ్వాలన్నా లంచం ఇవ్వాల్సిందేనన్నారు.
ఈ లంచాల వ్యవహారాలన్నీ కొందరు వ్యక్తుల కనుసన్నల్లోనే వ్యవహారాలన్నీ నడుస్తున్నాయంటూ పరోక్షంగా లోకేశ్ గురించి కామెంట్ చేశారు. మోడీ, చంద్రబాబు మధ్య పాతకక్షలు ఏవో ఉన్నాయని.. పవన్ అన్నారు. బీజేపీ, టీడీపీ ఎప్పుడు మిత్రులవుతారో, ఎప్పుడు శత్రువులవుతారో తెలియదన్నారు. మోద�