అక్రమ సంబంధం.. ఇటీవల రాష్ట్రంలో ఈ పేరు మరీ ఎక్కువగా వినపడుతోంది. కామవాంఛలకు అలవాటు పడి శరీర కోరికలను ఎలాగయినా తీర్చుకోవాలి అనే దుశ్చర్యలో పచ్చని కాపురాలని  నిట్టనిలువునా కూల్చుకుంటున్నారు. మొన్న జరిగిన స్వాతి, దేవి ఉదంతాలే ఇందుకు నిదర్శనాలు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాతకంగా హత్య చేసింది ఒక మహిళ. హైదరాబాదు నగరంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది.


వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా వంగర మండలం, గీతనపల్లి గ్రామానికి చెందిన సింహాచలం, విజయ దంపతులు బతుకుదెరువుకోసం హైదరాబాదుకు వచ్చారు. వీరికి ఇంటర్, పది తరగతులు చదివే కొడుకులు ఉన్నారు. వీరిది బొంతలు కుట్టే వ్యాపారం అవడంతో గౌరీనాయుడు అనే వడ్డీ వ్యాపారస్థుని వద్ద డబ్బులు అప్పు  తీసుకునేవాడు. దీనితో గౌరీనాయుడు, సింహాచలం ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో సింహాచలం భార్యకు, గౌరీనాయుడుకు వివాహేతరసంబంధం ఏర్పడింది.


ఈ విషయం తెలుసుకున్న సింహాచలం భార్యను మందలించాడు. దీంతో తమకు సింహాచలం అడ్డువస్తున్నాడన్న నెపంతో వారు శుక్రవారం రాత్రి సింహాచలం గొంతుకు నైలాన్‌తాడుతో ఉరేసి చంపేశారు. వారిద్దరూ సింహాచలం ఉరేసుకున్నాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలకు ఏర్పడుచేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సింహాచలం శరీరంపై ఉన్న గాయాలను చూసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరీనాయుడు పరారీలో ఉండగా, సింహాచలం భార్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: