గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ నాలుగున్నర  సంవత్సరాలు టీడీపీ తో మైత్రి కొనసాగిస్తూ తాజాగా జనసేన పార్టీ సాంవత్సరిక సభలో అనూహ్యంగా బాబుపై, లోకేష్ పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మీ అబ్బాయి లోకేష్ చేస్తున్న అవినీతి వ్యవహారాలు మీ దృష్టికి వచ్చాయా? అసలు అవేంటో మీకు తెలుసా? అంటూ చంద్రబాబును ప్రశ్నించాడు. మహనీయుడు ఎన్టీఆర్ మనవడిగా ఉండి మీరు చేస్తున్న పని ఇదేనా అంటూ మంత్రి లోకేష్ కు గట్టిగానే కౌంటర్ వేశాడు.


అయితే అనూహ్యంగా పవన్ ఇలా మాట్లాడతాడని బాబు సైతం ఊహించలేదు. పవన్ విమర్శలను వీరిరువురు తిప్పికొట్టారు. తన తాత, తండ్రిలాగా గొప్పనాయకుడుని అవుతానో లేదో తెలియదు కానీ వారికి చెడ్డపేరు మాత్రం తీసుకరానని అసెంబ్లీ సాక్షిగా లోకేష్ చెప్పుకొచ్చారు. పవన్, వైసీపీ, బీజేపీలు కలిసి దొంగాటలాడుతున్నాయంటూ బాబు సైతం పవన్ పై విరుచుకపడ్డాడు.


తాజాగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన పవన్ తనకు నలభై మంది టీడీపీ ఎమ్మెల్యేలు స్వయంగా  దగ్గరకు వచ్చి బాబుపై కంప్లైంట్ ఇచ్చారని బాంబు పేల్చాడు. కాగా ఈ విషయాలను బాబుకు చెప్పాలని ప్రయత్నించినా ఆయన తేలికగా తీసుకున్నారని ఆరోపించారు. పవన్ చెప్పిన మాటలకు బాబు వణికిపోతున్నాడని సమాచారం.ఒకవేళ నలభై ఎమ్మెల్యేలు కోల్పోతే ఇక భవిష్యత్తులోనైనా అధికారంలోకి రావటం అసాధ్యం అని, టీడీపీ అతలాకుతలం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నాడంట. పార్టీ ఎమ్మెల్యేలతో ఒక మీటింగును ఏర్పాటుచేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: