విజయసాయిరెడ్డి.. వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికకాబడిన మొట్టమొదటి ప్రజాప్రతినిధి. ఎటువంటి రాజకీయ అనుభవం, ఏవిధమైన రాజకీయ నేపథ్యం లేకుండానే వైసీపీ అధినేత జగన్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకానికంటే ఇంకా వంద రెట్లు కష్టపడుతూ రాజ్యసభలో తనదైన ముద్రను వేస్తూ వస్తున్నారు.


చంద్రబాబు 29 సార్లు ప్రధాని మోడీని కలవాలని ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రధానిని అవలీలగా కలిసేస్తూ రాష్ట్రరాజకీయాలలో శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇదే విషయం జగన్ కు మేకులు దించుతుంది. అదెలాగంటే ప్రధానిని, విజయసాయి రెడ్డి కలిసిన ప్రతీసారి మీడియా ఫోటోలు తీస్తుంది. వాటిని ఛానెల్స్ లలో నిరంతరం చూపిస్తారు. బాబు అడుగుతే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వైసీపీతో పొత్తు కోసమే ఇలా ఆ పార్టీ వారికి ఎప్పుడుపడితే అప్పుడు వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారని, ఫోటోలకు పోజులిస్తున్నారని టీడీపీ విమర్శలకు దిగుతోంది.


కొన్ని రోజుల క్రితం జగన్ బంధువయిన వినీత్‌రెడ్డిని విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇక దానికి సంబంధించి మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. బీజేపీ- వైసీపీల బంధం బలపడిందని చెప్పడానికి ఇదో సాక్ష్యం అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్న బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుంది జనాలు వీటినన్నిటిని గమనించి ఓటు వేయాలి అంటూ టీడీపీ నేతలు వైసీపీకి వ్యతిరేఖంగా ప్రచారాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ తరపున మంచే చేస్తున్నా  అవి జగన్ కు మేకులు దించేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: