వెండితెరపై వెలిగిపోయిన కొంత మంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినవారు కొంతమంది అయితే..పత్తాలేకుండా పోయిన వారు మరికొంత మంది ఉన్నారు. ఈ మద్య తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే  కమల్ లు పార్టీ కూడా అనౌన్స్ చేశారు. 
Image result for telugu-actress-reshma-rathore hot
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రేష్మ రాథోర్ సంచలన ప్రకటన చేసింది. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించింది. 2019 లో తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు  సన్నద్ధం అవుతున్నట్లు తెలిపింది. తొలిసినిమాతోనే సక్సెస్ అందుకుని జూనియర్ త్రిషగా పేరు సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. 
Related image
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, అప్పవమ్ వీన్‌జుమ్ (మలయాళం), అధాగప్పట్టత్తు మగజనన్‌గలై (తమిళ్) చిత్రాలతో బాగానే అవకాశాలను అందిపుచ్చుకుంది. కాగా రేష్మ రాథోర్ కు ప్రస్తుతం సినీ అవకాశాలు బాగా తగ్గాయి. రేష్మ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. సినిమాల్లోనటిస్తున్నప్పటికీ తన ఊరి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని రేష్మ చెబుతోంది.
Image result for telugu-actress-reshma-rathore hot
రేష్మ రాథోర్ షూటింగ్ గ్యాప్ దొరకడంతో సొంత జిల్లాలో పర్యటిస్తూనే ఉన్నారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు రాజకీయాలు అంటే ఇష్టం అని ఇక్కడి ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వచ్చి సేవచేస్తా అన్నారు.యితే ఏ పార్టీలో చేరతారో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఓ జాతీయ పార్టీలో చేరతానంటూ హింట్ ఇచ్చారు రేష్మ రాథోర్. 


మరింత సమాచారం తెలుసుకోండి: