ఓ నిర్మాత భార్య హెచ్చరిక ఇప్పుడు సినీరంగంలో హాట్ టాపిక్ గా మారింది. సినీరంగంలో నిర్మాతలకూ,హీరోయిన్లకూ ఉన్న లింకుల గురించి ఎప్పటి నుంచో రూమర్లు ఉన్నాయి. సినీ అవకాశాల కోసం నిర్మాతలకు తమ అందాలు ఆరబోయడం తప్పనిసరి అవుతోందని ఇటీవల చాలా మంది హీరోయిన్లు ఏకంగా మీడియాకే చెప్పేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ నిర్మాత భార్య నేరుగా రంగంలోకి దిగడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏకంగా హీరోయిన్లను వేశ్యలతో పోల్చింది. త్వరలోనే అలాంటి హీరోయిన్ల గుట్టుబయటపెడతానని వార్నింగ్ కూడా ఇచ్చేసింది. మౌనంగా ఉండాలా? లేదా తుపానులా విజృంభించాలా?.. నేను రెండోది ఎంచుకున్నాను’ అంటూ ఆమె పెట్టిన
ట్వీట్ కలకలం రేపుతోంది.
తన ట్వీట్లతో సోషల్ మీడియాలో కలకలం రేగడంతో ఆమె కొంతసేపటికి ట్వీట్లు డిలీట్ చేసేశారు. మళ్లీ కొత్తగా ట్వీట్ చేశారు. కొన్ని సున్నితమైన విషయాలు వినోదానికి సరికావు. నేను చేసిన పోస్ట్ నా సొంత సమస్య కాదు, నా భర్తతో నాకు ఎటువంటి సమస్యలు లేవని ఆ ట్వీట్ లో తెలిపారు. పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారన్న ఆమె.. తన పోరాటానికి మద్దతు తెలపాలన్నారు.
నేహా వార్నింగ్ తో ఇప్పుడు ఆమె ఎవరి గుట్టు విప్పబోతోందా అన్న చర్చ మీడియాలో మొదలైంది. సహజంగానే జ్ఞానవేల్ రాజా గతంలో నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ల
గుండెల్లో గుబులురేగుతోంది. తాము ఎక్కడ వివాదాస్పదం అవుతామో అని వారు భయపడుతున్నారు.