సినీ రచయిత దర్శకుడు నటుడు పోసాని కృష్ణ మురళి వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా సూటిగా స్పష్టంగా మొహం మీద మాట్లాడుతాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమా వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి నందమూరి కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ….నందమూరి కళ్యాణ్ రామ్ చాలా మంచి వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే టైటిల్ అతనికి కరెక్టుగా సూట్ అవుతుంది అని….నిజంగా కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని కితాబిచ్చారు...అంతేకాకుండా కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావాలని ముఖ్యంగా ఆయన తాతగారు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గా చూడాలని తన కోరిక అని ఈ వేదికపై సంచలన కామెంట్ చేసారు.
మీరు ఎమ్మెల్యే అయితే సమాజం బాగుపడుతుందని అన్నారు. దీంతో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో సినిమారంగంలో చర్చనీయాంశమయ్యాయి... మీ పార్టీ అంటే టీడీపీలో మీకూ వాటా ఉందనేలా అర్ధం ఉందని కొంత మంది చెప్పుకుంటున్నారట.
టీడీపీ ఇప్పుడు బాబు చేతిలో ఉంది. ఇక బాలయ్య కూతురును లోకేష్ కు ఇచ్చాడు కాబట్టి….ఆయన అటువైపే. ఎటొచ్చి హరికృష్ణ కుటుంబం మాత్రమే పార్టీకి దూరంగా ఉంది. దీంతో ఆయన వ్యాఖ్యలకు మరో అర్ధం చెబుతున్నారు కొంత మంది. మొదటి నుంచి బాబు పాలనను వ్యతిరేకిస్తున్న పోసాని కావాలనే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొంత మంది చెప్పుకుంటున్నారు.