2014 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబుతో పని చేసిన పవన్ కళ్యాణ్...2019 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకి మేకు అయి కూర్చున్నారు. ఒక్కసారిగా మిత్రపక్షంగా ఉండే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి శత్రువు అయిపోయారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చాలా పెద్ద ప్రణాళికలు వేసారు అని తెలుస్తోంది.


రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని గతంలో ప్రకటించారు పవన్. దీనికనుగుణంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 40 మంది కాపు కీలక నేతలను తన పార్టీలోకి తీసుకుని రాబోతున్నారని వార్తలు ఇప్పటికే వినపడుతున్నాయి.

Image result for pawan kalyan chandrababu

అంతేకాకుండా తన అన్న చిరంజీవి కూడా జనసేన పార్టీలోకి వస్తారట. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపితో రహస్య సంబంధాలు ఉన్నాయని అధికార పార్టీ తెలుగుదేశం ఆరోపించడం జరిగింది.

Related image

ఇదిలా ఉండగా వచ్చే ఆగస్టు కల్ల తెలుగుదేశం పార్టీ పై పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి టీడీపీని ఖాళీ చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టడానికి శ్రీకారం చుట్టాడు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ ఆలోచనలు చూస్తుంటే  ప్రజారాజ్యం పార్టీని దెబ్బ కొట్టిన ప్రతి పార్టీ నాయకుడిని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: