ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ కన్నా కాస్ట్లీ అయిపోయిందనే వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రియా పెట్టె పోస్ట్ లకు కూడా రూ 8 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఒక్క ఎక్స్ప్రెషన్.. కుర్రకారు గుండెలను యమా గిలిగింతలు పెట్టింది. ఆమె కంటి సైగలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. చూపులతోనే ట్రిగ్గర్ నొక్కేసినంత పనిచేసిన ప్రియా వారియర్.. ఇప్పుడు ఎంతోమంది యువత గుండెల్లో కొలువుదీరింది.
ఆమెకు సంబంధించిన చిన్న ఫోటో బయటకొచ్చినా సరే.. క్షణాల్లో అది వైరల్ అవుతోంది. అదీ ఇప్పుడామె క్రేజ్. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ ఫోటోషూట్ కూడా నెట్టింట వైరల్గా మారింది. మెన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ఒకేఒక్క వీడియోతో ఈ బ్యూటీని పెద్ద సెలబ్రిటీని చేసేసింది.
దేశ వ్యాప్తంగా ఈమె గురించి చర్చించుకునేలా చేసింది. ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్ను సైతం వెనక్కి నెట్టేసింది.తాజాగా ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్ను సైతం వెనక్కి నెట్టేసింది."రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు జరుగుతాయి.. పరధ్యానం లేకుండా జాగ్రత్తగా వాహనాలు నడపండి" అంటూ రాసిన పోస్టర్పై ప్రియా వారియర్ ఫొటో ఉంది.
మరో పోస్టర్పై "కొన్నిసార్లు షేరింగ్ అనేది కేరింగ్ కాదు : మీ పాస్వర్డ్లు అసలు ఎన్నటికీ ఎవరికీ చెప్పవద్దు" అని రాసి ఉంది.ప్రియా వారియర్ ఫొటోతో కూడిన ఈ తరహా పోస్టర్ల రూపకల్పన వెనుక ఓ సృజనాత్మక సంస్థ ఉన్నట్లు తెలిసింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిబంధనలను ఉల్లంఘిస్తూ యువత ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వడోదర పోలీసులు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేయడం ప్రశంసనీయం.
అంతే కాదు యూత్ కి ఇప్పుడు కావాల్సిందల్లా నవీన పోకడలు..అందుకే మేం ఈ ఫోటో తో మెస్సేజ్ ఇవ్వాలనుకున్నాము. ఈ పోస్టర్లతో ప్రచారం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వడోదర పోలీసు కమీషనర్ మనోజ్ శశిధర్ మీడియాకి తెలిపారు.