ప్రస్తుతం ఉప్పు- నిప్పులా ఉన్న చంద్రబాబు మోడీ వ్యవహారం అనూహ్యమైన మలుపు తిరగబోతోందా.. చంద్రబాబుపై కక్ష పెంచుకున్న మోడీ ఓ బిగ్ స్కెచ్ రెడీ చేశారా.. అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహకరిస్తున్నారా.. అంటే అవుననే అంటోంది ఏబీఎన్ అండ్ ఆంధ్రజ్యోతి కో. అవునట.. ఇప్పుడు చంద్రబాబుకు చెందిన కీలక రహస్యం మోడికి చేరిందట. 



చంద్రబాబును జైల్లో పెట్టించేదాకా నిద్రపోనని శపథం చేసిన విజయసాయిరెడ్డి ఓ కీలక సమాచారాన్ని మోడికి అందించారట. ఇప్పుడు దాని ఆధారంగా చంద్రబాబుపై చర్య తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. ఈ మాట వేరే ఇంకెవరైనా చెప్పి  ఉంటే.. అబ్బే మా బాబు నిప్పు.. ఆయన రహస్యం ఏదీ మోడీకి చేరదు.. అసలు చేరేంత సీక్రెట్లేమీ లేవు అని వాదించేవాళ్లమే.

Image result for MODI AND VIJAY SAI REDDY

కానీ ఈ గుట్టు బయటపెట్టింది చంద్రబాబును కంటికిరెప్పలా కాపాడుకుంటారనే పేరున్న ఆంధ్రజ్యోతి అండ్ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ. ఆదివారం నాటి తన సంపాదకీయంలో ఆయన ఈ విషయం బయటపెట్టారు. "చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో సమాచారాన్ని విజయసాయిరెడ్డి ఇటీవలే ప్రధాని మోదీకి అందజేశారనీ, దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి కార్యాలయం ఇంటెలిజెన్స్‌ బ్యూరోను ఆదేశించినట్టు తెలిసింది" అని రాధాకృష్ణ రాసుకొచ్చారు. 

Image result for MODI AND ABN RADHAKRISHNA

"విజయసాయిరెడ్డి వంటి నమ్మకస్తుడైన మిత్రుడిని చూసుకుని చంద్రబాబును వదులుకోవడానికి నరేంద్ర మోదీ సిద్ధపడ్డారు. మోదీ– విజయసాయిరెడ్డిల అపూర్వ కలయిక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది మరికొంతకాలం గడిస్తే గానీ తెలియదు." అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ లాంటి వ్యక్తి ఏదో ఒక కీలకమైన ఆధారం లేకుండా విజయసాయిరెడ్డి మాట వింటారా.. మొత్తం మీద ఏదో పెద్ద గూడుపుఠాణీయే నడుస్తున్నట్టు అనిపించడం లేదూ..!



మరింత సమాచారం తెలుసుకోండి: