ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టులో కేంద్రం రివ్యూ పిటీషన్. రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం. గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కేంద్రం విజ్ఞప్తి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విటిషన్ విచారణ. సుప్రీం మార్గదర్శకాలపై దేశ వ్యాప్తంగా దళిత సంఘాల ఆందోళన. కాగా, దళిత సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది.
దళిత సంఘాల ఆందోళనలో పదకొండ కు చేరిన మృతుల సంఖ్య. నిన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళిత సంఘాల భారత్ బంద్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా జరగ్గా మరికొన్ని చోట్లు పాక్షికంగా జరిగింది. అయితే ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం పై సుప్రీం కోర్టు కీలక తీర్పును ఇచ్చింది.
ఈ చట్టం కింద కేసు నమోదు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయవద్దని ముందుగా వాస్తవాలను నిర్థారించుకున్న తరువాతే అరెస్టులు జరగాలంటూ సుప్రీం తన తీర్పులో స్పష్టం చేసింది. అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని దీని వల్ల అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటూ కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ హక్కులను కాపాడుకుంటాంటూ వారు ఆందోళన బాట పడ్డారు.