భారత దేశంలో రాష్ట్రాల మద్య నీటి యుద్దం సర్వసాధారణం..కానీ కర్ణాటక, తమిళనాడు మధ్య దశాబ్దాలుగా సాగుతోన్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది.  ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయలేదని..పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.  మరోవైపు  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటుచేయాలని తమిళనాట ఉద్యమం సాగుతోంది. కావేరీ గొడవ తెరపైకి వచ్చినప్పుడల్లా  కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో తెరపైకి వస్తుంటాయి.
Kannada actor Ananth Nag
ఈ మద్య కోలీవుడ్ ఒక్కరోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షా శిబిరంలో రజినీకాంత్ మాట్లాడుతూ.. ఓ పక్క ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. తాజాగా ఈ విషయంపై రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమలహాసన్‌లపై కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ నిప్పులు చెరిగారు. కావేరీ జలాల పంపిణీ అంశంపై వీరు వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. కరుడు గట్టిన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
Image result for kamal rajini
అనంత్ నాగ్ మాట్లాడుతూ.. కర్ణాటక, కావేరీ జలాల అంశంపై రజనీకాంత్, కమలహాసన్‌ల ధోరణి కొంత భిన్నంగా ఉంటుందని భావించామని, కానీ కరుడుగట్టిన రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళ రాజకీయ గూండాల బాటలోనే వీరిద్దరూ నడుస్తుండడం బాధాకరమన్నారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేసిన నటుడు అనంత్ నాగ్.. కమల్, తలైవాలపై విరుచుకుపడ్డారు.

వచ్చే నెలలో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని, అప్పటి వరకూ ఈ నటులిద్దరూ సంయమనం పాటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమకు ఎంత వాటా వస్తుందో ఆ వాటాను కర్ణాటక ఇవ్వాలని యువ నటుడు శింబు అన్నాడని, ఆ మాత్రం పరిపక్వత కూడా వీరికి లేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.ఆఫ్రికాలో నైలు నది సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జల వివాదాలు పరిష్కారమయ్యాయని, కానీ, తమిళ నేతలు మాత్రం కావేరీ వివాదానికి మాత్రం పరిష్కారం చూపకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారని ఆరోపించారు.
Image result for kaveri water
138 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇంకెన్నాళ్లు కొనసాగాలని ప్రశ్నించారు. కన్నడిగుల మంచితనాన్ని చేతకాని తనంగా భావించవద్దని హెచ్చరించారు. కాగా, అనంత్ నాగ్ కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ సహా 300 చిత్రాల్లో నటించారు. పలు జాతీయ అవార్డులను కూడా అందుకున్న ఆయన 1990లో జనతాదళ్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: