కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాం,ఇంక తమకు ఎదురుచెప్పేదెవరు, ఎవరైనా ఎదురుతిరిగితే వాళ్లను ఎవరు కాపాడలేరు అనే రీతిలో దేశంలో బీజేపీ నాయకులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పై రేప్  కేసు నమోదవగా ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంకో బీజేపీ నేత ఇతరనాయకుడి భార్య గురించి వివాదాస్పద వాఖ్యలు చేసి అపఖ్యాతిపాలయ్యాడు.


వివరాల్లోకివెళితే పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనీయకుండా అడ్డుకున్న విపక్షాల తీరుకు నిరసనగా బీజేపీ ఎంపీలు ఏప్రిల్ 12న నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో ఎంపీ మనోహర్‌ ఉన్‌త్వల్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మధ్య ప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఏం చేయలేదు. కానీ, ఢిల్లీ నుంచి ఓ ఐటెంను మాత్రం తీసుకొచ్చారు. ఇటీవల నర్మద యాత్ర అంటూ ఏదో హడావుడి చేశారు" అంటూ ప్రసంగించారు.


అయితే ఆయన దిగ్విజయ్ సతీమణి  పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఐటెం వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశించి మాత్రమే  చేశాడంటూ  కాంగ్రెస్‌ పార్టీవారు  మండిపడుతున్నారు. ఈ ఆరోపణలపై ఉన్‌త్వల్‌ స్పందిస్తూ ‘దిగ్విజయ్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను నర్మద యాత్రను ఉద్దేశించి మాత్రమే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని చెప్పాను. అంతేగానీ ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు" అని వివరణ  ఇచ్చారు. కాగా ఆయన మాటలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ వారు ఆయనపై ఠాణాలో కంప్లైంట్ ఇవ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: