వై.ఎస్. జగన్ పాదయాత్ర రాజధానికి చేరుకుంది. గుంటూరు జిల్లా మీదుగా అది విజయవాడలోకి అడుగిడింది. విజయవాడ అంటే రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతాన్ని తాను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు చంద్రబాబు వెంటే ఉంటారని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. 


జగన్ అధికారంలోకి వస్తే.. అమరావతి అభివృద్ధి కుంటుబడుతుందని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ పాదయాత్రకు విజయవాడలో అద్భుతమైన స్పందన కనపించింది. విజయవాడ జన సంద్రాన్ని తలపించింది. ప్రకాశం బ్యారేజీ నిండా వచ్చిన జనం.. ఆ జనంలో జగన్ పాదయాత్ర చూస్తే అందులో ఏదో భవిష్యత్ సంకేతం మాత్రం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: