పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ ల మధ్య రచ్చ జరుగుతున్నప్పుడు మధ్యలో దూరి కత్తి మాటలకు బలి అయింది నటి పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ కు ఆరు ప్రశ్నలు సంధించి ఆమెకు ముచ్చెమటలు పట్టించాడు. నిజానికి అసలు పవన్, పూనమ్ కౌర్ ల మధ్య ఒక బంధం నడిచిందని, అందులో త్రివిక్రమ్ ఒక ముఖ్య భూమిక పోషించాడని కత్తి మహేష్ లీక్ చేసేంత వరకు ఎవరికీ తెలియదు. 


అయితే కాలంతో పాటే అసలు నిజానిజాలేంటో ఎవరికీ తెలియకుండా సమసిపోయాయి. అయితే ఆ కూపీని లాగడానికి టీడీపీ పన్నాగాలు పడుతుందని సమాచారం. టీడీపికి చెందిన ఒక ఛానల్ ఈ వ్యవహారానికి సంబందించి మొత్తం సమాచారం, పక్కా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మొదటి పరిచయం ఎలా , ఎక్కడ జరిగింది, వారిద్దరి మద్య సాన్నిహిత్యం ఎంత దూరం వెళ్లింది అన్న అంశాలను చేధించడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారట.


ఇప్పటికే ఆ టీమ్ ఆమె స్వస్థలం పంజాబ్ బయల్దేరడానికి సిద్దమయ్యారట. త్రివిక్ర‌మ్ అంటే పూన‌మ్ కౌర్ కు ఎందుకు కోపం, అసలు వారిద్దరి మధ్య త్రివిక్రమ్ ఎలా వచ్చాడు. ఆమె చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక కావడం వెన‌క అసలు ఎవరున్నారు వంటి కోణాలపై దర్యాప్తు జరిపి వాటిని టెలీకాస్ట్ చేసి పవన్ రాజకీయ ఇమేజ్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: