వైసిపి అధినేత జగన్ రాష్ట్రంలో చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ క్రమంలో జగన్ కి ప్రజల నుండి వస్తున్న మద్దతును చూసి అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఇటీవల జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగింది.

Image result for prathipati pulla rao

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్  చేస్తున్న పాదయాత్ర పై….ఈ పరిణామంలో అనుకోకుండా మంత్రి పుల్లారావు నోరు జారి రాజధాని అంటు చంద్రబాబు చేస్తున్న డ్రామాన్ని అనుకోకుండా బయటపెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జగన్ పాదయాత్ర వల్ల రాజధాని రైతుల భూముల విలువ రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ తగ్గిపోయినట్లుగామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు.

Image result for prathipati pulla rao

ఒకప్పుడు రాజధానిలో అద్భుతమైన అభివృద్ధి చెందుతుందని జగన్ వెళ్లి చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి అన్ని వ్యాఖ్యానించిన ప్రత్తిపాటి పుల్లారావు.. అంత అభివృద్ధే జరిగితే.. బాబు మాటలన్నీ నిజమైన పక్షంలో జగన్ పాదయాత్ర వల్ల గజానికి రూ.2-3వేలు ఎలా తగ్గాయన్న విషయాన్ని కూడా ఆయనే చెబితే బాగుంటుందని అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు.

Image result for prathipati pulla rao

దీన్ని బట్టి అర్థం అవుతుంది రాజధాని అంటూ రైతుల భూములు లాక్కొని అభివృద్ధి అంటూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నావి అన్ని డ్రామాలేనన్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: