ఎన్నికలకు మరో ఏడాది సమయం  ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు జగన్ కు అనుకూలంగా మారుతున్నాయా.. గతంలో టీడీపీ వైపు వైసీపీ నాయకులు చూసేవారు.. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందా.. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా.. అంటే అవునంటున్నారు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి. 

Image result for JAGAN VIJAYASAI

ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ తో టచ్ లోకి వచ్చారని.. అదను చూసి వారు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేల విషయంలో ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అంతే కాదు చంద్రబాబు ఎర్రచందనం స్కామ్ ద్వారా 10 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 



గతంలో ఎర్రచందనం అమ్మితే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చైనాతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని విజయసాయి హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: