ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా టీడీపీ వర్సెస్స వైసీపీ కి మద్య మాటల యుద్దం జరుతుంది.  ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో నిరసనలు తెలుపుతున్న సమయంలో ఇరువురు నేతలు పార్లమెంట్ సాక్షిగా ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఇదిలా ఉంటే 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు... వారి పేర్లు బయటపెట్టిన గంటలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది... ఇది, గత సంవత్సరం వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అన్న మాటలు... ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఇవే మాటలు చెప్తున్నారు.
Image result for tdp protest parlemtns
తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు... అంతే కాదు, ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్ల అంతు కూడా చూస్తారు అంట... విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Related image
తాజాగా ఈ అంశంపై స్పందించిన  టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడతా. ‘బాగున్నారా విజయసాయిరెడ్డి గారు’ అని పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడతా..వాళ్లతో కలిసి కాఫీ తాగుతా. యోగ క్షేమ సమాచారాల కోసం, కలిసి కాఫీ తాగడం కోసం వారితో టచ్ లో ఉంటాను.
vijayasai 16042018 1
అలా అని చెప్పి..నేను వైసీపీలోకి వెళుతున్నానని ఎప్పడైనా చెప్పానా? అన్నారు.  ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనాకొడుకులా..చాలా తెలివైన వాళ్లు! వైసీపీ లోకి టీడీపీ వాళ్లు వెళ్లి ఇప్పుడేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. మాజీ ఎమ్మెల్యేలు కొందరు నీ (జగన్) దగ్గరకు వస్తారు నాయనా! వాళ్లకు టికెట్లు ఇవ్వు.. ఎవరొద్దన్నారు?’ అని జేసీ తన దైన శైలిలో మాట్లాడారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: