ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ ఒక్కరోజు బంద్ విజయవంతం చేసాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రధానపాత్ర పోషించింది. రాష్ట్రంలో ప్రతి ఊరూ తిరుగుతూ ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్యకర్తలు తమ నిరసనలు ప్రచార పార్టీ కార్యకర్తలతో కలిసి తెలిపారు.
అయితే ఈ క్రమంలో ఈ బంద్ విజయవంతం అవడంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని దాన్ని సాధించుకునే వరకు ఆంధ్ర ప్రజలు ఎవరు నిద్రపోరు అని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పారు.
ప్రజలకు అసౌకర్యం కలిగించే బంద్ లాంటివి చేయడం తమ పార్టీ విధానం కాదని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులకు అభినందనలు తెలిపారు. ఇదే ఉద్యమ వేడిని చివరి వరకు కొనసాగించి ప్రత్యేక హోదా సాధించాలని అన్నారు.
అంతేకాకుండా ఈ బంద్ అనంతరం ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో ప్రజల స్పందన చూస్తుంటే ప్రత్యేక హోదా విషయాన్ని బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నాటుకుని ఉంది అని అన్నారు. అయితే ఇదే ఉద్యమస్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని తెలుగు సినిమారంగం నటీ నటులతో కలిసి ఢిల్లీలో త్వరలో ఆందోళన చేస్తున్నామని చెప్పారు.