జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ మహాసభలలో సినిమా వేడుకలలో ప్రజలను ఉద్దేశించి అద్భుతంగా ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా మరిముఖ్యంగా ఆడవారిని తన అక్క చెల్లెళ్లు అంటూ సంబోధిస్తూ ఉంటారు. అయితే తాజాగా తెలుగు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో హీరోయిన్ల అవుదామనుకున్నా చాలామంది తెలుగమ్మాయిలు రోడ్డు ఎక్కడం జరిగింది. అంతేకాకుండా పబ్లిక్ గా మీడియా వేదికలపై బహిరంగ చర్చలో పాల్గొంటూ సినీ ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అవుతున్న దర్శకులపై స్టార్ హీరోలపై నిర్మాతలపై ఎవరిని బడితే వారిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ ఆర్టిస్ట్ శృతి. తాజాగా ఇటీవల ఫిలింనగర్ లో సినీ మహిళా మండలి ఏర్పాటు చేసిన చర్చావేదికలో సినీ ఆర్టిస్ట్ శృతి ఈ వ్యాఖ్యలు చేసింది...పవన్ కల్యాణ్కు మూడు పెళ్లిళ్లు అయినా.. ఇప్పటికీ ఆ యావ ఛావలేదు, అతనికి మసాజ్లు చేయడానికి బెంగాళీ అమ్మాయిలే కావాలి అని, అందు కోసం పవన్ కల్యాణ్ ప్రతీ ఆదివారం తన ఫామ్హౌస్కు పది మంది అమ్మాయిలను తెప్పించుకుంటాడంటూ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
అందుకు సంబంధించిన వివరాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు నేను రెడీ.. పవన్ కల్యాన్కు దమ్ము, ధైర్యం ఉంటే రమ్మనండి.. నేను వీడియోలతో సహా ఆధారాలను బయటపెడ్తా అంటూ చెప్పింది నటి శృతి. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక మంత్రిని పవన్ కళ్యాణ్ వీడియోలను సంపాదించడానికి హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టారు.
ఈ నేపథ్యంలో సినీ ఆర్టిస్ట్ శృతి న్ని కలవడానికి సదరు మంత్రి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటులతో బేరసారాలు చేస్తున్నారట. ఎలాగైనా పవన్ కళ్యాణ్ వీడియోలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.