తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ఇతర కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారని చెప్పి బాంబు పేల్చాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అంతేగాక వారిపట్ల వైసీపీ అధినేత జగన్ ఆసక్తి కనబరచటంలేదని చెప్పి టీడీపీ నాయకుల విలువను తక్కువ చేసి మాట్లాడాడు.


ఈ వాఖ్యలు టీడీపీ శ్రేణులకు అవమానకరంగా అనిపించాయో లేక కోపం కలిగించాయో తెలియదు కానీ అంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రం ఆయన వాఖ్యలపై కాస్త ధీటుగానే స్పందించాడు. వైఎస్సార్ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ కార్యవర్గంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పి విజయసాయి కి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.


ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తీరుతో సొంతపార్టీ వారే  విసిగిపోయారని, ఇందుకే వారు తెదేపా వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయన్ని జగన్ ఒకసారి గుర్తుచేసుకుంటే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. జగన్ బాధితులైన కొంతమంది వైసీపీ నేతలు తెదేపాలో చేరిన విషయాన్ని ఎంపీ విజయసాయి  మర్చిపోయారని, దాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: