దీంతో గతంలో శ్రీ రెడ్డికి మద్దతు తెలిపిన ఓయూ జేఏసీ...శ్రీ రెడ్డి వ్యవహారాన్ని చూసి తమ మద్దతు ఉపసంహరించుకున్నమని తెలిపింది. గతంలో శ్రీరెడ్డికి మద్దతుగా పలు మహిళా సంఘాలతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కూడా బాసటగా నిలిచింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని చెప్పిన ఓయూ విద్యార్థి జేఏసీ....ఫిల్మ్ చాంబర్ ఎదుట ధర్నా కూడా నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని ఓయూ జెఎసి నాయకుడు సంపత్ అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారు...కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఆయన దయ చూపిస్తారు. అలాగే గతంలో తెలంగాణలో జరిగిన కొన్ని వివాదాల గురించి తమతో మాట్లాడినప్పుడు సమాజం గురించి అనేక విషయాలు మాతో చెప్పారని అన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిపై శ్రీరెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మర్యాద కాదని అన్నారు.
ప్రస్తుతం శ్రీ రెడ్డి చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఏమీ కనపడటంలేదు...గతంలో ఏదో ఇండస్ట్రీలో మహిళలపై అన్యాయం జరుగుతుందని జేఏసీ స్పందించింది...అయితే ప్రస్తుత పరిస్థితుల బట్టి శ్రీ రెడ్డికి జెఎసి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటామని అన్నారు జేఏసీ నాయకుడు సంపత్.