సినిమాల్లో తమకు వేషాలు ఇప్పిస్తామని చెప్పి శారీరకంగా వాడుకుని, వారి కామదాహాన్ని తీర్చుకొని చివరకు సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా మోసం చేసిన, చేస్తున్న దుర్మార్గుల భరతం పట్టడానికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు ఒక క్రమ పద్దతిలో సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.


ఇన్నాళ్లు తనతో పాటు ఉంటూ వాళ్ళకు కూడా జరిగిన అవమానాలను బహిర్గతం చేసిన తోటి ఆర్టిస్టులు సైతం ఆమె పవన్ ను విమర్శించడంతో ఆమెకు దూరం అవుతున్నారు. సినిమావాళ్లకే కాదు రాష్ట్రంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా పవన ముందుంటారు! అటువంటి ఆయనపై శ్రీరెడ్డి రాయలేని విధంగా దూషించడం సరికాదంటూ ఆమెను విమర్శిస్తున్నారు.


ఈ సందర్భంలోనే ఆమె ఒకరితో మాట్లాడుతున్న ఫోన్ కాల్ లీక్ అయింది. "ఆ రాంగోపాల్ వర్మ గాడు 5 కోట్లు తీసుకొమ్మంటే నేను వద్దన్నాను. వాడు చెబితేనే పవన్ ను అలా తిట్టాను. మొదటనుండి పోరాటం చేస్తున్న నేను తీరా ఇంకొన్ని రోజుల్లో ఫలితం వస్తుందనుకుంటుండగానే ఈ పవన్ ను తిట్టడం వల్ల నా ఉద్యమం మొత్తం నీరుగారిపోయింది. ఈ నాకొడుకులని ఎలాగయినా చావుదెబ్బ కొడతాను. ఆ పవన్ కల్యాణ్ గాడి ఓటమి కోసం నా రక్తపు చివరి బొట్టువరకు కష్టపడతాను" అని వేరే వ్యక్తితో మాట్లాడుతున్న ఫోన్ కాల్ లీక్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: