ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్న దీక్ష విజయంతం కావాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై టీడీపీ మహిళ నాయకురాలు ముళ్లపూడి రేణుక సారధ్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఒక్కరోజు నిరాహారదీక్షకు చేయనున్న విషయం తెలిసిందే.   ఈ దీక్ష విజయవంతం కావాలని కోరుతూ..ఆయనకు మనోబలం చేకూర్చాలని  టీడీపీ మహిళా నాయకురాలు ముళ్లపూడి రేణుక సారధ్యంలో దుర్గామాతకు నిర్వహించిన ఈ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  


ఈ సందర్భంగా రేణుక మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబుకు ఉండాలని కోరినట్లు తెలిపారు. సీఎం దీక్షకు మహిళలందరు సంఘీభావం ప్రకటించారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబుకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్లు ఆమె చెప్పారు.  
  ‘మన కోసం’ పేరుతో కొండపైకి వెళ్లిన మహిళలకు ఈవో పద్మ, పాలకమండలి చైర్మన్ సాగర స్వాగతం పలికారు.
Image result for chandrababu
కాగా, విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవాడలోని బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ దీక్షను చేపట్టనున్నారు చంద్రబాబు నాయుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: