ఇటీవల శ్రీ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ ఆయన తల్లిని రాయలేని విధంగా దూషించిన సంగతి తెలిసిందే. అయితే అమె వాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, ఆయన సోదరుడు నాగబాబు, ఇతర కుటుంబసభ్యులు మరియు తారాగణం మండిపడ్డారు. ఆమె వాడిన భాష మంచిది కాదని, పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ అప్పుడు పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా అనలేదు.


తాజాగా ఆమె వాఖ్యలపై గతరాత్రి నుండి ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ వస్తున్నాడు. ఒక దిగువతరగతి కుటుంబం నుండి వచ్చిన తన తల్లిని ఎలా తిట్టించారంటూ దీని వెనుక ఉన్న బడా వ్యక్తుల బండారం బట్టబయలు చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పవన్  నేడు ఫిలిం ఛాంబర్ వద్ద ఈ వ్యవహారంపై రచ్చ చేశాడు. పవన్ కు మద్దతుగా మరికొందరు మెగా హీరోలు మరియు మెగా బ్రదర్ నాగబాబు కూడా హాజరయ్యారు.


కుటుంబ సభ్యుల మరియు ఇండస్ట్రీలోని  పెద్దలతో సమావేశం నిర్వహించిన  అనంతరం పవన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. 24 గంటల్లో తనకు న్యాయం జరగాలని అలా కాని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. అయితే ఎల్లో మీడియాపై విషంగక్కిన పవన్ తానే ఒక ఛానల్ పెట్టబోతున్నట్లు  సోషల్ మీడియా కోడై కూస్తుంది. జనం కోసం "J టీవీ " అనే పేరుతో ఉన్న ఒక పోస్టర్ సామజిక మాధ్యమాలలో వైరల్ అయింది. అయితే ఛానల్ పెడుతున్న  దానిపై పవన్ నుండి కానీ జనసేన నుండి కానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: