ఎన్నికలకు కేవలం ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయంగా వ్యూహాలకు పదువు పెట్టారు. ఇప్పటికే టీడీపీతో తెగదెంపులు చేసుకుని ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. నాలుగేళ్లలో పెద్దగా ఏమీ సాధించలేకపోయిన ఆయన ఆ నెపం కేంద్రంపై వేసేలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పుట్టిన రోజునాడు నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ ధర్మపోరాట దీక్ష కోసం చంద్రబాబు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మీడియా వాళ్లకు కూడా మంచి ప్యాకేజీ ఇచ్చారని చెబుతున్నారు. ఇంతా ప్లాన్ చేస్తే బాలకృష్ణ వంటి కొందరు చేసిన నోటి దూల ప్రసంగాలు అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా సాగాయి. ప్రధాని మోడీ తన భార్యను గౌరవించడం నేర్చుకోవాలని బాలకృష్ణ ఆవేశంగా అన్నారు.
అక్కడితే ఆగకుండా ఆయన తెలుగువాళ్లతో పెట్టుకుంటే ఇంతే సంగతులని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ.. ప్రసార అర్హం కాని, ప్రస్తావించడానికి వీలు లేని భాషలో ప్రధాని మోడీని ఉద్దేశించి బూతులు లంకించుకున్నారు. నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం.. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో..అంటూ రెచ్చిపోయారు బాలకృష్ణ.
అంతేకాదు.. మోడీ.. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు. అంటూ ఆ వెంటనే మోదీ తల్లిని ఉద్దేశించి దారుణమైన బూతు పదం వాడారు. బాలకృష్ణ బూతపురాణంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు.