తన తల్లిపై అభ్యంతకర వ్యాఖ్యల వెనుక ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్.. వారికి సంబంధించిన విషయాలన్నీ బయటకు చెబుతానని, స్టే ట్యూన్డ్ అంటూ ప్రకటించారు. ఓ నటి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తుంటే..ఆ మ్యాటర్ పక్కన బెట్టి పర్సనల్ విషయాల జోలికి వెళ్తూ..తనని టార్గెట్ చేసుకొని ఏ పాపం తెలియని తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఆమెతో అలాంటి మాటలు మాట్లాడేలా ప్రేరేపించిన రాంగోపాల్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యామిలీ..ఫ్యాన్స్. 
Image result for pawan film chamber
ఈ విషయాన్ని తాను కూడా లీగల్ గానే వెళ్తానని..చెబుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్.  కాగా, నిన్న ఫిలిమ్ ఛాంబర్ లో మూడు టివి ఛానల్స్ పై నిప్పులు చెరిగిన పవన్ మరికొంత మంది పేర్లు కూడా బయట పెడతానని అన్నారు.  ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు(శ్రీసిటీ ఓనర్) అతడికి లీగల్ నోటీసులను పంపారు. దానికి సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్.. మీ బెదిరింపులకు బెదిరిపోనని స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా..‘‘ శ్రీని రాజు మీరు పంపిన నోటీసులు నన్నేం మార్చలేవు.

రియల్ అఙ్ఞాతవాసి రవి ప్రకాశ్ చొరవతో మా తల్లిపై జరిగిన అవమానాన్ని మీరు పదే పదే చూపించారు. మీ సీఈవో, అలాగే అతడిని ప్రభావితం చేసిన రాజకీయనాయకులు అందరిపై న్యాయపోరాటం చేస్తా. గుడ్‌లుక్ శ్రీని’’ అని కామెంట్ పెట్టారు.. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: