ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తే...సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. కొంత మంది భార్యలు అక్రమసంబంధం కోసం కట్టుకున్న భర్తలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. కొంత మంది అయితే సుపారీ ఇచ్చి మరీ భర్తలను చంపిస్తున్నారు. ఇక అక్రమ సంబంధం..వరకట్నం కోసం భార్యలను దారుణంగా హతమారుస్తున్న భర్తల భాగోతాలు కూడా బయట పడుతున్నాయి.
తాజాగా ఓ దుర్మార్గుడు భర్త అనే పదానికి మచ్చతెచ్చాడు. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యను దారుణంగా అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే..కరీంగంజ్ జిల్లాకు చెందిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అతడికి డబ్బుతో పాటూ బంగారాన్ని కట్నంగా ఇస్తామని అత్తింటివాళ్లు ఒప్పుకున్నారు.
తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని..అనుకున్న సమయానికి కట్నం సర్థలేక పోతున్నామని..చెప్పడం..ఇదే విషయం భర్తకు చెప్పడం జరిగింది. దాంతో భార్యపై కక్ష్య పెంచుకున్న భర్త తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు బయటకు వినపడకుండా... నోట్లో గుడ్డలు కూడా కుక్కారు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కొద్ది సేపటికి ఆమె కోలుకున్న తర్వాత తనపై జరిగిన అన్యాయాన్యాన్ని..అత్యాచారాన్ని బంధువులకు తెలిపింది. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమెను వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు... మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.