పవన్ కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు నేపధ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రోత్సాహంపై, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆయనపై విమర్శలతో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ లో విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన ఇన్ని రోజులు చాలా సహనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు "మెగాఫ్యామిలీ" కి ఇబ్బందికరంగా మారడం తనని మీడియా ముందుకు వచ్చేలా చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ చిత్రసీమలోని పలువురు ప్రముఖ సెలబ్రిటీలపై నటి శ్రీరెడ్డి "కాస్టింగ్ కౌచ్" ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా ముందుకు వచ్చి ఆ వ్యాఖ్యలను ఖండించ కుండా, ఇప్పుడు ఈ పెద్దమనిషి అగ్ర నిర్మాత చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పబడే ఆయన ఇలా కోరటం సరికాదన్న అభిప్రాయం కొందరు సినీ ప్రముఖులు వ్యక్తం చేశారంట. అంతేకాదు ఇంతదాకా మౌనంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలు, ఇప్పుడు సమస్య తమ దాకా వచ్చేసరికి హడావుడి - తమ సమస్య పరిశ్రమ సమస్యగా మార్చే తాపత్రయం తో హల్ చల్ చేస్తున్నారంటూ మరి కొందరు ఆయన ముఖం మీదే చెప్పినట్లు అభిఙ్జవర్గాల కథనం.
ప్రస్తుతం ఈ అంశంపై ఫిలింనగర్ లో చాలా చర్చనీయాంశంగా మరటమే కాదు ఆయన పెద్దరికం తగలబెట్తటానికా! లేక పవన్ కళ్యాణ్ తో బెడిసిన సంబంధాలను పున రుద్దరించుకొని జనసేనలోకి వచ్చి వ్హేరాలనా - బెల్లం ఉన్న చోటికే ఇలాటి ఈగలు వచ్చి చేరతాయికదా! అంటూ సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఆయన ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలపై పలువురు సినీపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాం గోపల్ వర్మ సమాధానం సినీ పరిశ్రమని కొందరు నటీ నటులను లక్ష్యంగా చేసుకుని డిబేట్లు నిర్వహిస్తున్న కొన్ని ఛానెళ్లను బహిష్కరించాల్సిందిగా ఆయన ప్రతిపాదన లేవనెత్తారంట.
ఈ మేరకు సహకరించాలని ఆయన అక్కడున్న సినీపెద్దలను కోరినట్లు సమాచారం. అయితే వారుమాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. అవకాశం దొరికితే చాలు అవకాశవాదులు వదులు కోరని అరవిందును ఉద్దేసించి ఫిలిం నగర్ పెద్దలు హాస్యోక్తులు ప్రకటిస్తున్నారట,
ఇప్పుడు అల్లు అరవింద్ దగ్గుబాటి సురెష్ బాబు కుటుంబాన్ని కాపాడటానికి కంకణం గట్టుకొని అందులో కూడా అవసరమైతే క్రెడిట్ కొట్టేసే వ్యూహం కనిపిస్తుందని అరవింద్ తీరు తెలిసిన వారు మాత్రం — ఈయన చేసేది ఏమీ లేదని సర్వత్రా చెప్పేమాటలు. అలాగే ప్రజారాజ్యాన్ని సినిమా నిర్మాణంలాగా, ఒక సినిమా వైఫల్యంగా చిత్రీకరించిన, ఈయన మాటలను జనం ఉటంకిస్తున్నారు. అసలు అల్లు అరవింద్ ప్రజారాజ్యంలో దూరిపోవటం తోనే అత్యద్భుత విజయం సాధించాల్సిన ప్రజా రాజ్యం పతనమైంది. అదే పవన్ కళ్యాణ్ గమనించి తొలి నుండి అల్లు అరవిందును కట్టడి చేయటం, దూరం పెట్టటం మంచిదని భావన ఆయన శ్రేయోభిలాషుల్లో వ్యక్తమౌతుంది.