కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని వర్గాల పోరు మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర తలనొప్పులు తెస్తుంది. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి లు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటూ ఉంటే వారిద్దరిని కూర్చోబెట్టి మరీ ఇద్దరిమధ్య సంధి కుదిర్చాడు బాబు. అయితే బాబు చెప్పిన మాటలను పెడద్రోవన బెట్టి ఇద్దరూ మళ్ళీ కయ్యానికి పాల్పడుతున్నారు.


తాజాగా ఏవీ సుబ్బారెడ్డి తన వర్గీయులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని వాఖ్యలు చేయడం మళ్ళీ దుమారాన్ని లేపుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం  నుండి శాసనసభ స్థానానికి పోటీ చేసేది తానేనని, అందుకు తగినవిధంగా  ఇప్పటినుంచే ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ పోవాలని తన అనుచరులకు సూచించారట. 


ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి అసలే ఏవీ మీద పీకల్లోతు కోపంలో ఉన్న మంత్రి అఖిలప్రియకు తెలిసిందట. ఇంకేముంది మళ్ళీ పాత కథే రిపీట్ అయిందని సమాచారం. అసలు నేను మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఈయన గారికి ఎలా టికెట్ ఇస్తారంటూ అగ్గిమీద గుగ్గిలం అయిందట. ఎమ్మెల్యేగా తాను కొనసాగుతుండగానే వచ్చే ఎన్నికలకు  ఆయన సన్నాహకాలు చేయడం ఏంటని మండిపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వీరికి బాబు మళ్ళీ క్లాస్ పీకుతాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: