నిన్న తిరుపతిలో చంద్రబాబు ఏర్పాటు చేసిన దీక్షకు నిరసనగా వైసీపీ కూడా విశాఖలో నయవంచన పేరుతో దీక్షను నిర్వహించిన సంగతి తెలిసినదే. ఈ దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా, టీడీపీ అధినేత చంద్రబాబుపైన, ఆయన కుమారుడు,మంత్రి అయిన లోకేశ్ పైన మరియు టీడీపీ నేతల పైన తనదైన శైలిలో విరుచుకపడ్డారు.


రాష్ట్రంలోని అవినీతిపరుల కోసం సీబీఐతో విచారణ జరిపిస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని ఆమె ఘాటు వాఖ్యలు చేశారు. కుట్ర రాజకీయాలకు బాబు పెట్టిందిపేరు అని, దానిపై పేటెంట్‌ రైట్స్  ఆయనవేనని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అదిచేస్తాను, ఇది చేస్తానని బాబు వాగ్ధానాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మొద్దని కోరారు.


అంతేగాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రతి ఐదుగురు ప్రజా ప్రతినిధులలో అందరూ తెదేపాకు చెందిన వారనే విషయం ఏడీఆర్‌ రిపోర్టు చెబుతోందని ఆమె గుర్తుచేశారు. నిన్నటి ఏప్రిల్ 30 వ రోజును టీడీపీ నేతల ఫూల్స్‌ డే అని అభివర్ణించారు. హోదా ఆశచూపి టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను వంచించాయని ఆమె చెప్పారు. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌ సీపీనే అని ఆమె చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: