భారత దేశంలో ఈ మద్య అత్యాచారాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కామాంధులకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన జమ్మూ కాశ్మీర్ ను వణికిస్తున్నది. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై అందరూ స్పందిస్తున్నారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాపై కఠిన చర్యలు తీసుకోక పోతే యావత్ భారత దేశం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని సామాజిక కార్యకర్తలు హెచ్చరించారు. సినీ, రాజకీయ సెలబ్రెటీలు సైతం కథువా అత్యాచారం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక కథువాలో జరిగిన దారుణ ఘటన తరువాత అటువంటి నేరస్తులకి మరణశిక్ష విధించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటికీ మృగాళ్లు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ బోరబండలోని ఓ సినిమా థియేటర్లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
థియేటర్లో తమ కూతురిపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఈ రోజు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.