జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మధ్య సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చాలా ఘాటుగా కామెంట్లు చేసుకుంటున్నారు. తాజాగా ఇటీవల తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన దీక్ష విషయంలో ఎంపీ గల్లా జయదేవ్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దీక్షలో ఆనాడు బీజేపీ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన వీడియోలు ప్రదర్శించారు.
Image result for galla jayadev pawan kalyan
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు...తిరుపతి సభలో మోదీ అలాంటి హామీ ఇవ్వలేదని, టీడీపీ చూపిస్తున్న వీడియోలు మార్ఫింగ్ చేసినవని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన ఆ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.
Related image
మోదీ ప్రసంగానికి సంబంధించి మార్ఫింగ్ చేసిన వీడియోలతో ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన ఆ కథనాన్ని గల్లా జయదేవ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ట్వీట్ చేశారు.
Image result for galla jayadev pawan kalyan
‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఆ సభలో మీరు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు మాట ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గారని మీరే నేరుగా మోదీని నిలదీయొచ్చు కదా!. ఆ రోజు జరిగిన దానికి మీరే సాక్ష్యం. మీరే చెప్పండి ఇవి మార్ఫింగ్ వీడియోలా?’’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో...


మరింత సమాచారం తెలుసుకోండి: