ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు...తిరుపతి సభలో మోదీ అలాంటి హామీ ఇవ్వలేదని, టీడీపీ చూపిస్తున్న వీడియోలు మార్ఫింగ్ చేసినవని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన ఆ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.
మోదీ ప్రసంగానికి సంబంధించి మార్ఫింగ్ చేసిన వీడియోలతో ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన ఆ కథనాన్ని గల్లా జయదేవ్ ట్విట్టర్లో షేర్ చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ట్వీట్ చేశారు.
‘‘పవన్ కల్యాణ్ గారూ.. ఆ సభలో మీరు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు మాట ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గారని మీరే నేరుగా మోదీని నిలదీయొచ్చు కదా!. ఆ రోజు జరిగిన దానికి మీరే సాక్ష్యం. మీరే చెప్పండి ఇవి మార్ఫింగ్ వీడియోలా?’’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో...