కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్.. బిజెపి ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఒక పార్టీ మీద మరొక పార్టీ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image result for sidhi ramaiaha vs modi

ప్రస్తుతం మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా గడుపుతున్నారు...ఇక్కడ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో మోడీ వారం రోజులపాటు బహిరంగ సభలలో ఎన్నికల నుంచి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక సవాలు విసిరారు. మాటల్లో తనను గెలవాలని ఎద్దేవా చేశారు.

Image result for sidhi ramaiaha vs modi

అయితే మీకు రాహుల్ ఎందుకు నేను చాలు అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సై అన్నారు. మా పార్టీ అధ్యక్షుడి వరకు ఎందుకు నాతో తలపడు చాలు… అంటూ ట్విట్టర్ లో ..‘‘మోదీజీ.. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను.. యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో చేసిన అభివృద్ధి గురించి పేపర్ చూసే 15 నిమిషాలు మాట్లాడండి’’ అంటూ సిద్ధరామయ్య ప్రతి సవాల్ విసిరారు.

Image result for sidhi ramaiaha vs modi

దీంతో కర్ణాటక రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాయి. అయితే సర్వే ఫలితాలు బట్టి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విజయవకాశాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: