ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది.  మొన్నటి వరకు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న ఆశలో ఉన్న అధికార పార్టీ సైతం ఇప్పుడు కేంద్రంపై నిప్పులు చెరుగుతుంది.  ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేసిన ఎంపీలు ఏపీలో దశల వారీగా పోరాటం చేస్తూ కేంద్రంపై నిరసన తేలిపేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. 
Image result for tdp cycle yatra
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిరాహార దీక్ష చేసి..తిరుపతిలో ‘ధర్మపోరాటం’ సభ ద్వారా కేంద్రంపై నిరసన తెలిపారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని మెరుగైన వైద్య సేవ అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

కాసేపట్లో మాగంటి బాబును విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, టీడీపీ చేపట్టిన సైకిల్‌ యాత్రలో తరుచూ అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం సైకిల్‌ యాత్రలో పాల్గొన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు గాయాలపాలవ్వగా అనంతరం కొన్ని రోజులకి ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ పల్లె రఘునాథరెడ్డికి కూడా గాయాలైన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: