ఈ క్రమంలో కేంద్రంలో కీలక పదవులలో కూడా ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వ్యక్తులనే మోడీ ప్రభుత్వం నియమించింది. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మోడీ దక్షిణాది రాష్ట్రాలపై కపట మాటలు చెప్పారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తులను కేంద్రంలో కీలక పదవుల్లో కూర్చోపెట్టామని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ మంత్రి పదవులను ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా దక్షిణాదికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు..సాధారణంగా.. ప్రధాని ఉత్తరాది వారైతే.. రాష్ట్రపతిని దక్షిణాది నుంచి నియమిస్తారు.
కానీ ఈ సారి మోదీ అతి కూడా పాటించలేదు. పనికి రాని ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి… అదేదో గొప్పగా ఇచ్చామన్నట్లు జబ్బలు చరుచుకుంటున్నారు అని అన్నారు. అంతేకాకుండా ఇటువంటి వైఖరి కలిగిన వ్యక్తులు దేశంలో అధికారంలో ఉంటే దేశం 2 ముక్కలవుతుందని పేర్కొన్నారు.