ఈ మద్య దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. గుంటూరు లోని దాచేపల్లి ఘటన మరువక ముందే.. అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇందుకు మరో ముగ్గురు పిల్లలు సహకరించారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..ముగ్గురు పిల్లల వయస్సు 10, 12, 13 ఏళ్లు మాత్రమే వారితో ఆడుకోవడానికి ఓ చిన్నారి వచ్చింది. ఆ  చిన్నారిని 15 ఏళ్ల బాలుడు సమీపంలోని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

బయట ఆ ముగ్గురు బాలురు కాపాలా కాశారు. అనంతరం బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. ఆమె పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లు షాకయ్యారు.  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎందుకిలా చేశారని ప్రశ్నించగా వారు షాకయ్యే సమాధానం ఇచ్చారు.

ఈ మద్య తాము మొబైల్ లో కొన్ని వీడియోలు (పోర్న్) చూశామని, తమకు కూడా అలా చేయాలనిపించిదని సమాధానం ఇచ్చారు. నేరానికి పాల్పడ్డ పిల్లలను జువైనల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  కాగా, పిల్లలకు అందుబాటులో సెల్ ఫోన్ ఉంచకూడదని..ఇలాంటి ఫోర్న్ సినిమాలు చూడటం ద్వారా మనసు చెంచలం అవడం..ఇలాంటి అకృత్యాలకు పాల్పడం జరుగుతుంది..దేశంలో అత్యాచారాలకు ఇదీ ఒక కారణం అని పోలీసులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: