బిజెపి నుంచి టిడిపి బయటికి రావడం తో చంద్ర బాబుకు కేసులా భయం పెట్టుకున్నట్లుంది.  కేంద్ర ప్రభుత్వం నా మీద కేసులు బనాయించే అవకాశం ఉంది. అదే జరిగితే.. ప్రజలంతా నాకు అండగా నిలబడాలి... అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలికిన బేల పలుకులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే ఈ వ్యాఖ్యలు విని చాలా మంది చంద్ర బాబు మీద సెటైర్లు వేస్తున్నారు. ముద్ర గడ పద్మ నాభం ఏకంగా బాబుకు ఒకలేఖను సంధించాడు. ఇందులో లోకేష్ ప్రస్తావన ఉంది.

Image result for lokesh

లోకేష్ ప్రమేయం ఉన్న అవినీతి కార్యకలాపాల గురించి ఇబ్బడిముబ్బడిగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన మీద విచారణ అనివార్యం అని చాలామంది అనుకుంటున్నారు. అయితే.. పరిస్థితి లోకేష్ అరెస్టు వరకు వెళ్లే అవకాశం ఉన్నదా? అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు కలుగుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మరో లేఖాస్త్రం సంధించారు.

Image result for lokesh

కేంద్రం కేసులు పెట్టి విచారణలు చేయిస్తుందని, ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరడంపై ముద్రగడ సెటైర్లు వేశారు. ఈ వ్యవహారం గుమ్మడికాయల దొంగ అంటోంటే... భుజాలు తడుముకున్నట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. మీవెనక ఉన్నందుకు సామాన్య ప్రజలను కూడా ఉక్కు పాదాలతో అణచివేస్తే వారికి దిక్కెవ్వరు అంటూ ప్రశ్నించారు. మొత్తానికి పరిస్థిని చూస్తుంటే బాబు అతని పుత్ర రత్న మీద కూడా కేసులు పడే అవకాశం ఉందని అమరావతి వర్గాలు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: