తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మరియు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మధ్య మాటల దాడి ఉధృతమవుతోంది. దాచేపల్లి ఘటనకు  నిరసినగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన  కార్యక్రమాన్ని నిర్వహించగా, దానిలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ - ఆ ప్రాంత  ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మహిళల్ని వేధిస్తున్నారంటూ ఆరోపణలు  చేసిన సంగతి తెలిసిందే.


ఇక రోజా చేసిన ఆరోపణలపై ఆయన కూడా ఘాటుగానే స్పందించారు. రోజా క్యారెక్టర్ ఏంటో తెలుసు,  అవకాశల కోసం చెన్నైలో ఆమె వేసిన వేషాలు మొత్తం తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. నోటికిష్టం వచ్చినట్లు మాట్లాడితే గుండు కొట్టిస్తానని వాఖ్యానించారు. ఇప్పుడు ఆయన వాఖ్యలకు రోజా స్పందించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్టణంలో  నిర్వహిస్తున్న పాదయాత్ర లో పాల్గొన్న ఆమె ఆయనకు కౌంటర్లు వేశారు.


ఆమె మాట్లాడుతూ-  తాను ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలోనే ఉన్నానని తెలిపారు. నీ ఏరియాకే వచ్చాను, దమ్ముంటే ఇక్కడికి రా!ఎవరు గుండు కొట్టించగలరో చూసుకుందామని ఆయనకు సవాల్ విసిరారు. దాచేపల్లి ఘటానా నిందితుడిని పట్టుకోలేకపోవడం చంద్రబాబు అసమర్థపాలనకు అద్దం పడుతుందని విమర్శించారు. ప్రజలు టీడీపీకి బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆమె తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: