ఎన్నికలు దగ్గరపడే కొద్దీ నాయకుల ఆరోపణలు మీరిపోతున్నాయి. వ్యక్తిగతంగా దూషించుకోవడం మరీ ఎక్కువైపోతోంది. నటి, రాజకీయనాయకురాలు రోజాపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.ఇప్పుడు టీడీపీ నేతలు మరో కొత్త ఆరోపణ చేస్తున్నారు. ఆమె ఫుల్లుగా మందుకొట్టి మీడియా ముందుకు వస్తున్నారట.

Image result for roja

రోజా మందు తాగి ప్రెస్ మీట్ పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. కావాలంటే బ్రీత్ అనలైజర్ టెస్టు చేసుకోవచ్చని సవాల్ విసురుతున్నారు. జగన్‌ రోజాను బురదలో దొర్లే పంది మాదిరిగా అధికార పక్షంపైకి వదిలేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు.

Image result for tdp

దోచుకోవడం కోసం ఇప్పటి నుంచే వైసిపి ఎమ్మెల్యేలు తమ శాఖలను కేటాయించుకుంటూ పగటికలలు కంటున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్‌కు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎవ్వరికైనా‌ సహాయం చేయడం తెలియదంటున్నారు. దాచేపల్లి ఘటన బాధితురాలికి చంద్రబాబు తన సొంత డబ్బు 5లక్షలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Image result for ysrcp

రాష్ట్రంలో విజయసాయిరెడ్డి, రోజా వంటి వైసీపీ దండుపాల్యం గ్యాంగ్ తిరుగుతోందంటున్నారు బుద్దా వెంకన్న. వీళ్లు పగలంతా తిరుగుతూ రాత్రుల్లు ఇళ్లు దోచుకొనే మాదిరిగా వైసిపి దండుపాల్యం సంచరిస్తోందని ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: