భారత దేశంలో మహిళలపై ప్రతిరోజూ అకృత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.  ఓంటరిగా మహిళ కనిపిస్తే చాలు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చిన్నారులపై అత్యాచారం జరిగిన ఘటన మరువక ముందే..విశాఖలో మరో దారుణం జరిగింది.  ఓ యువతిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపాలెంలో కలకలం రేపిందీ ఘటన.  స్థానికులు వెల్లడిస్తున్న మరింత సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన ఓ యువజంట నాలుగు నెలల క్రితం గోపాలపట్నం వచ్చి నివాసం ఏర్పరచుకుంది. భర్త హైదరాబాద్, ఒడిశా తదితర ప్రాంతాల్లో నిర్వహించే మ్యూజికల్ నైట్స్ కు భార్యతో కలసి వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి వస్తుండేవాడు.
Image result for murder
అయితే భార్యాభర్తల మద్య విభేదాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన ఆమె, ఒంటరిగా సంతోషినగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆ యువతి భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. కాగా, ఒంటరిగా ఉన్న ఆమెపై కొంత మంది కన్ను వేయడం ఓ వ్యక్తి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడని, అతనే తన స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని దహనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆమెతో కలిసున్న వ్యక్తులు, ఇటీవలి కాలంలో ఆమెను కలిసిన వారి వివరాల కోసం షీలానగర్, నరవ, గాజువాక, కొత్తపాలెం, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో భర్తకు సంబంధం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: