అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను కూడా చంద్రబాబు సొమ్ము చేసుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలన్న తలంపు చంద్రబాబులో ఎంతమాత్రం లేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలన్న చంద్రబాబు తీవ్రంగా చీకటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Image result for agrigold

అగ్గిగోల్డ్ ఆస్తులు కొట్టేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో అమర్ సింగ్ తోనూ, ఇతరులతోనూ అర్దరాత్రి చీకట్లో భేటీ అవుతూ బేరాలు సాగిస్తున్నారని జగన్ ఘాటుగా విమర్శించారు. ఒక బ్రోకర్ మాదిరిగా అగ్రి గోల్డు ఆస్తులపై బేరాలు చేస్తున్నారన్నారు. ఈ బేరాలపై పచ్చ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

Image result for rape images

ఆడపిల్లలను కాపాడుకుందామంటూ చంద్రబాబు చేస్తున్న హంగామాపైనా జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు 4సంవత్సరాల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 3వేల24మహిళ వేదింపుల కేసులు నమోదు అయ్యాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుర్తుచేశారు. పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గములో 155వ రోజు యాత్ర కొనసాగింది.

Image result for rape images

నెహ్రూ చౌక్ సెంటర్లో సభలో మాట్లాడుతూ మహిళలు వేధింపులకు గురయిన 4ఏళ్ల పాటు మిన్నకుండి ఎన్నికలు సమీపిస్తుండటంతో కొవ్వొత్తులతో డ్రామాలు ఆడుతున్నారని జగన్ ఎద్దేవా చేసారు. క్యాబినేట్ లో ఇద్దరు మహిళ వేధింపుల కేసులలో ఆరోపణలు ఉన్న మంత్రులు ఉండటం సిగ్గు చేటని జగన్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: