తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో అందరూ చూస్తున్నారని..కానీ ఈ మద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు. అవకాశం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ పై అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా వున్న ఆయన మళ్లి వయోలెంట్ గా మారి కేసీఆర్ పై మాటల యుద్దం మొదలు పెట్టారు.
Image result for formers
గతంలో  రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే, నిలదీసి, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. మళ్ళి ఆయనే ఎంతోమంది రైతులను జాలి, దయ, కనికరం లేకుండా అరెస్ట్ చేయించిన విషయం మర్చిపోలేమన్నారు.  ఇప్పుడు ‘రైతు బంధు’ పథకం పెట్టి వారి చేతుకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..కనీసం వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కరూపాయి కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.
Image result for kcr
త్వరలో తలపెట్టిన రైతు బంధు కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ కూడా రావద్దని తాను లేఖలు రాస్తానని అన్నారు. కాగా రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే మళ్లి ఇప్పుడు ఓటుకు నోటు కేసును బయటకు తీసారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడల వల్లనే రాష్ట్రం ఇలా ఉందని, ఆయన ఆ విధమైన పద్దతులను పక్కనపెట్టి, ప్రజల మీద, ప్రజా సమస్యల మీద దృష్టిపెట్టాలని హితవు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: