ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో కీలక భూమిక పోషించిన నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు.  కొంత కాలంగా టీఆర్ఎస్ పై పలు విమర్శలు గుప్తిస్తూ వస్తున్న జనార్థన్ రెడ్డి ఈ మద్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.  తాజాగా నాగం జనార్థన్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నారాయణమ్మ (95) మృతి చెందారు.

కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌ లోని పంజాగుట్ట నిమ్స్‌ లో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచినట్టు నారాయణమ్మ కుటుంబసభ్యులు తెలిపారు.  వయసు మీద పడటంతో అనారోగ్యం భారిన పడిన నారాయణమ్మ నిమ్స్ లో చేరారు.   నారాయణమ్మ మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: