సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి కొన్ని పాత్రలు బాగా సూట్ అవుతుంటాయి..అలాగే మహానటి సావిత్రి విషయంలో కీర్తి సురేష్ చక్కగా సూట్ అయ్యిందని..సావిత్రి పోలికలతోనే కాదు చాలా వరకు ఆమెలా నటించారని..ఇక ఈ సినిమాలో అన్ని పాత్రలు అద్భుతంగా పండించారని చిత్ర యూనిట్ ని తెగ పొగిడేశారు..తెలంగాణ మంత్రి కేటీఆర్. సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించిందని కొనియాడారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది.
అప్పట్లో ఈ సినిమాపై చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేశారు..అసలు ఆమె జీవిత కథ ఆధారంగా చేస్తున్నారా..లేక కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా కథ వక్రీకరిస్తున్నారని రక రకాల పుకార్లు వచ్చాయి. వాటన్నింటికి సమాధానంగా మహానటి పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి.
ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి..అంతే కాదు ‘మహానటి’కి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు, సాంగ్స్ చూస్తుంటే..సినిమా పై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. బోల్డన్ని అంచనాల మధ్య విడుదలైన ‘మహానటి’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు దర్శకుడు, నటీనటులు సహా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంచనాలకు మించి ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక మంత్రి కేసీఆర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యలు అద్భుతంగా నటించారని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.