గత కొంత కాలంగా పాక్ లో హిందువులపై  దాడులు పెరుగుతున్నాయి. తాజాగా వడ్డీ వ్యాపారిపై పోలీసుల దాష్టీకం శిరోముండనం చేయించి మీసాలు, కనుబొమ్మలు తొలగించిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. హిందువులు అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న పాకిస్థాన్ లో వారిపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్వాతంత్రం వచ్చాక ఇండియాకు వెళ్లకుండా పాకిస్థాన్ లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన చున్నీలాల్ అనే వ్యాపారికి తాజాగా తీరని అవమానం ఎదురైంది.

సింధ్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటనపై పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం కార్యకర్త కపిల్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం..చున్నీలాల్ అనే వడ్డీ వ్యాపారిని అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారన్నఆరోపణలపై శికార్ పూర్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 

అంతే అతన్ని శారీరకంగా హింసించడమే కాకుండా దారుణంగా  శిరోముండనం చేయించడంతో పాటు మీసాలు, కనుబొమ్మలను తొలగించారు. కాగా,  సింధ్ ప్రాంతంలో హిందువుల సంఖ్య కేవలం 4 శాతంగా మాత్రమే ఉండటంతోనే ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయని కపిల్ దేవ్ విచారం వ్యక్తం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: