ఈ మద్య బీజేపీపై ఒంటి కాలిపై లేస్తు ఎన్నో సంచలన విమర్శలు చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. రేపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రకాశ్ రాజ్ పలు సూచనలు చేశారు.
ఇప్పటి వరకు ప్రజలు మోసపోయింది చాలు అని..ఇక ముందు అయినా మేల్కోండీ అంటూ..ఎవరికైతే ఓటు వేస్తామో రేపు వారే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేశారు. ఆ విధానాలు మన జీవితాలను ప్రతిక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయని హెచ్చరించారు.
ఓటు వేసే ముందు వివేకాన్ని కోల్పోవద్దని..ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని..నిజమైన నాయకుడు ప్రజల్లో ఉంటారని అలాంటి వారినే గెలిపించాలని అన్నారు. ఉజ్వల, సమ్మిళిత, భవిష్యత్తు భారతావని ఆవిష్కరణ విషయంలో ఇది మీ అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
ఈ మద్య కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, 2019లోను ఢిల్లీలో అధికారం కోల్పోతుందని, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కారని నటుడు ప్రకాశ్ రాజ్ సంచల ఆయన గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 12న ఎన్నికలు జరగనుండగా, 15న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.