పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు శనివారం నిశ్చతార్ధం జరిగింది. ఆగస్టు 29 తేదీన వివాహం జరపాలని నిర్ణయమైంది. మాజీ డిజిపి సాంబశివరావు మేనల్లుడు భార్గవ్ తోనే అఖిల వివాహం జరుగుతోంది. నిశ్చితార్ధానికి ఎంపి రామ్మనోహర్ నాయుడు, మంత్రి నారాయణ తదితరలు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. అఖిలకు గతంలోనే వైసిపి కమలాపురం ఎంఎల్ఏ రవీంద్రరెడ్డి కుమారినితో గతంలో వివాహం జరిగిన విషయ అందరికీ తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల ఆ వివాహం రద్దైంది. మళ్ళీ ఇంత కాలానికి అఖిల వివాహం జరుగుతోంది. త్వరలో జరుగనున్న వివాహం ఓ విధంగా ప్రేమ వివాహమనే చెప్పవచ్చు.