ఈ మద్య భారత దేశంలో మహిళలపై, యువతులపై...చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..కామాంధులు అకృత్యాలు అంతకంతగా పెరిగిపోతూనే ఉన్నాయి.  విచ్చలవిడి శృంగారానికి బానిసలైన కొంత మంది దుర్మార్గులు ఒంటరి ఆడవారు..యువతులు కనిపిస్తే రెచ్చిపోతున్నారు.  ఈ మద్య ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
Image result for dachepalli
ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది..చేసిన తప్పుకు ఆ దుర్మార్గుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  కాగా, ఏపిలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించిపోయిందని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా దాచేపల్లిలో మరో ఘోర అకృత్యం వెలుగు చూసింది.   దాచేపల్లిలోని పదమూడేళ్ల బాలికపై ఎంపీటీసీ భర్త మాబూవలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ చిన్నారిని బెదిరించాడు.
Image result for dachepalli
దీంతో, భయపడిపోయిన ఆ చిన్నారి ఈ విషయం బయటపెట్టలేదు. గత కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందుల్లో పడటంతో విషయం బయటకు పొక్కింది. దాంతో స్థానికుల సహకారంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
Image result for dachepalli
పోలీసులు సదరు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: